టాలీవుడ్ నటి కలర్స్ స్వాతి చాలా రోజుల తరువాత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. నవీన్ చంద్ర హీరోగా, స్వాతి హీరోయిన్గా నటించిది. ప్రధానంగా నవీన్ చంద్ర వింటేజ్ లుక్ యువకుడిగా కనిపించారు. టీజర్ని బట్టి చూస్తుంటే భార్య, భర్తల మధ్య క్షణిక ఆవేశంలో వచ్చే చిన్న చిన్న తగాదాలు.. వాటి వల్ల వారి జీవితాల్లో ఏర్పడే కలతలు తరహాలో ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది.
టీజర్ ని పరిశీలించినట్టయితే.. నేను నీకో విషయం చెబుతా కళ్లు మూసుకో.. ఐ లవ్ యూ మధు అంటూ స్వాతి చెప్పే డైలాగ్తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా 20 ఏళ్ల బాధ ఇప్పుడు నీకు 20 నిమిషాల్లో చెప్పాలంటే చెప్పలేను. చెప్పే ఉద్దేశం కూడా లేదు అని స్వాతి డైలాగ్ ఆసక్తికరంగా ఉంటుంది. మరోవైపు 20 ఏళ్ల క్రితం నెత్తి నోరు బాదుకున్నా వినకుండా ఆ మధుగాడిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడేమో వాడితోనే విడాకులు కావాలని రోడ్డుకెక్కావు. సరైన కారణాలు కూడా చెప్పడం లేదు వంటి డైలాగ్లు ఆకట్టుకుంటున్నాయి.
నవీన్చంద్ర ఎప్పుడూ మద్యం షాపువైపు వెళ్లడం కనిపిస్తుంది. తాగుడుకి బానిసైతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో చూపించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఒక లవ్, పెళ్లి, ఫ్యామిలీ నేపథ్యంలో మంత్ ఆఫ్ మధు అనే చిత్రం తెరకెక్కినట్టు స్పష్టవుతోంది.