Mrunal Thakur : క్రేజ్ తోపాటు పారితోషికం కూడా..

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మించిన లేటెస్ట్ మూవీ సినిమా సీతారామం. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాలో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు. దుల్కర్ ఇప్పటికే తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటిలో నటించారు. ఈ సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటనతో మెప్పించారు.

అలాగే ఇందులో సీతామహాలక్ష్మిగా మృణాల్ బాగా ఆకట్టుకుంది. తన నటనకు, అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఇక్కడ ఆఫర్లు క్యూ కడుతున్నాయట. వైజయంతి బ్యానర్ లో సీతారామం చేసిన ఆమె ఇదే బ్యానర్ లో మరో సినిమాకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. వైజయంతి బ్యానర్ లో స్వప్న సినిమా పతాకం పై నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది.

ఇందులో ఇప్పటికే మృణాల్ ను ఖరారు చేశారని టాక్. తెలుగులో ఆమెకు డిమాండ్ పెరగడంతో మృణాల్ భారీగా రెమ్యూనరేషన్ పెంచిందని టాక్ వినిపిస్తోంది. పెద్ద ప్రొడక్షన్ అయిన వైజయంతి బ్యానర్ లోనే ఆమె రెండు సినిమాలు చేస్తుండడంతో ఆమెను వరుసగా దర్శక నిర్మాతలు సంపాదిస్తున్నారట. దీంతో మృణాల్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని సమాచారం. దీంతో తొలి సినిమా అనంతరం ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం ఏంటని దర్శక-నిర్మాతలు అవాక్కవుతున్నారట. కాగా మృణాల్ తోలుత టీవీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు