Mythri-Aha : భారీగానే ప్లాన్ చేస్తున్నారు

ఆహా.. కాన్సెప్ట్ ఉన్న స్టోరీలను ఎంచుకుంటూ సినిమాలు, సిరీస్ లను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది.
అలాగే మైత్రీ మూవీ మేకర్స్.. ఈ నిర్మాణ సంస్థ గురించి ప్రత్యేకంగా ఏం చెప్తాం. ప్రస్తుతం టాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ లు తెరకెక్కిస్తుంది ఎవరు అంటే.. ఎవరైనా మైత్రీ వారి పేరే చెబుతారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తోంది.

ఇలాంటి ఈ రెండు సంస్థలు కలిసి ఒక ప్రాజెక్ట్ ను చేస్తే.. ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రయోగం పట్టాలెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఆహా వీడియో సంయుక్తం గా ఒక ప్రాజెక్ట్ ను చేయబోతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు వెలువడింది. #SGRE అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ఫస్ట్ లుక్, టైటిల్ ను త్వరలోనే విడుదల చేస్తామని ఆహా ట్విట్టర్ లో ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ పోస్టులో “చిన్న చేపను పెద్ద చేప.. చిన్న మాయ పెను మాయ… అది స్వాహా ఇది స్వాహా… చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ, సుఖీ భవ!” అనే క్యాప్షన్ ను కూడా పెట్టింది. అయితే మైత్రీ మూవీ మేకర్స్, ఆహా నిర్మించబోయే ప్రాజెక్ట్ కు ఈ క్యాప్షన్ కు మధ్య సంబంధమేమిటీ ? అని సినీ లవర్స్ తెగ ఆలోచిస్తున్నారు. అలాగే #SGRE అని ఎందుకు పెట్టారు ? ఇదే టైటిలా.. అని కామెంట్ చేస్తున్నారు. దీంతో పాటు అసలు ఈ ప్రాజెక్ట్ ఎ జాన్రా లో తీస్తున్నారు ? భారీ స్థాయిలో నటీనటులను తీసుకుంటారా ? లేదా చిన్న యాక్టర్స్ తో కాన్సెప్ట్ బేస్ తో చేస్తారా ? అనే ప్రశ్నలు సినీ లవర్స్ కు ఎదురవుతున్నాయి.

- Advertisement -

మరి ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఈ ప్రాజెక్ట్ నుంచి మరో అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు