Mythri Movie Makers: ఓవర్సీస్ లో దుమ్ములేపుతున్న చిరు, బాలయ్య

రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ లో రెండు భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమాలు ఈ సారి సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు ఇప్పటికే ప్రమోషన్లు భారీ స్థాయిలో చేసుకుంటూ వస్తున్నాయి. సాంగ్స్, ట్రైలర్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్ని జరుపుకున్న ఈ సినిమాలు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా చిరంజీవి, బాలయ్య దుమ్ములేపుతున్నారు. యూఎస్ ప్రీమియర్స్ కోసం ఈ రెండు సినిమాలకు భారీ మొత్తంలో డిమాండ్ కనిపిస్తోంది. వాల్తేరు వీరయ్య 13 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. 12వ తేదీన యూఎస్ లో ప్రీమియర్స్ వేయబోతున్నారు. దీనికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. వాల్తేరు వీరయ్య ప్రీమియర్స్ కి ఇప్పటి వరకు 350K యూఎస్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా అమెరికాలో వాల్తేరు వీరయ్య దాదాపు 240కి పైగా లోకేషన్స్ లో విడుదల కానుంది.

అలాగే నందమూరి బాలయ్య వీర సింహా రెడ్డి కూడా హై స్పీడ్ లో దూసుకెళ్తుంది. ఈ చిత్రం 12వ తేదీన విడుదల కానుంది. యూఎస్ లో ప్రీమియర్ షో 11వ తేదీనే రానుంది. ఈ ప్రీమియర్ షోకి ఇప్పటి వరకు 400K యూఎస్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా.. బాలయ్య వీర సింహా రెడ్డి యూఎస్ లో దాదాపు 254కి పైగా లోకేషన్స్ లో విడుదల కానుంది.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు