SGRE :ఓటిటిపై కన్నేసిన మైత్రి మూవీ మేకర్స్

టాలీవుడ్ లో ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ హావ నడుస్తుంది. ఒకప్పుడు దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉండేవో.. ఇప్పుడలాగే మైత్రి మూవీ మేకర్స్ పై ఉంటున్నాయి. ఒకప్పుడు దిల్ రాజు ప్రొడ్యూసింగ్ చేస్తున్నడంటే ఖచ్చితంగా సినిమా హిట్టవుతుందన్న దగ్గరి నుండి, ఇప్పుడా ఆ పేరు మైత్రి మూవీ మేకర్స్ సొంతం అయింది.

నవీన్ యెర్నేని, యనమలచి రవి శంకర్ స్థాపించిన ఈ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ అనాది కాలంలోనే మంచి పేరు, గుర్తింపు సంపాదించాయి. కొరటాల శివ దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ మొదటి సినిమాతోనే బ్లక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఇక శ్రీమంతుడు సినిమా ఇచ్చిన సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తూ వరుస సినిమాలు చేస్తూ, ఇండస్ట్రీలోనే అత్యంత ఎక్కువ సక్సెస్ రేషియో తో దూసుకుపోతున్నారు.

హీరోలలో చిన్న పెద్ద అనే తేడా చూడకుండా కథ బాగుంటే, సినిమా హిట్ అవుతుంది అని నమ్మితే ఎంత బడ్జెట్ అనేది చూసుకోకుండా దర్శకుడికి, సినిమాలో పని చేసే క్యాస్ట్ & క్రూ కి ఎలాంటి ఇబ్బంది కలగాకుండా చూసుకోవడంతో, యంగ్ హీరోలలో చాలా మంది మైత్రి మూవీ మేకర్స్ లో సినిమా చేయాలనీ చూసే పేరు సంపాదించారు. అయితే ప్రస్తుతం పెద్ద, పెద్ద ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉన్న ఈ కంపెనీ తాజాగా ఓటిటి పై కూడా కన్నేసింది.

- Advertisement -

ఈ మధ్య కాలంలో ఓటిటికి పెరిగిన డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని మైత్రి మూవీ మేకర్స్ ఓటిటిలో కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ ప్రయత్నానికి ముందడుగుగా పుష్ప సినిమా కేశవా పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్ హీరోగా, ఆహా లో సత్తిగాని రెండెకరాలు అనే సినిమా చేస్తున్నారు.అయితే ఈ సినిమా ఈ నెల 26 నుండి స్ట్రీమింగ్ లోకి రాబోతుంది. ఈ సందర్బంగా సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మూవీ యూనిట్. మరీ సినిమాలల్లో విజయం సాధించిన మైత్రి మూవీ మేకర్స్ ఓటిటిలో ఎంత వరకు సక్సెస్ అవుతారనేది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు