NaveenPolishety: “స్వాతిముత్యం” కోసం “జాతిరత్నం”

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. “స్వాతిముత్యం” అనే సినిమాతో బెల్లంకొండ గణేష్ పరిచయమవుతున్నాడు. వర్షా బొల్లెమ్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించగా.. లక్ష్మణ్ కే కృష్ణ ఈ మూవీని తెరకెక్కించారు. లవ్ ట్రాక్ తో యూత్ ను మెప్పిస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేే పాయింట్ తో రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రం నుండి ఇంతవరకు విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అందరిలో మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచింది.

మహతీ స్వర సాగర్ సమకూర్చిన బాణీలు ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్, ప్రగతి, సురేఖ వాణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈనేేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం (నేడు) హైదరాబాదులోని మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి రానున్నట్లు తాజాగా స్వాతిముత్యం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుందని చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. దీంతో నవీన్ పోలిశెట్టి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు