Nikhil Siddharth : 18 పేజెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్

‘కార్తికేయ 2′ సినిమాతో 100 క్రోర్స్ క్లబ్ లో చేరాడు హీరో నిఖిల్ సిద్ధార్థ్. కార్తికేయ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి తెలుగుతోపాటు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇదే జోష్ తో ముందుకు సాగిపోతున్నాడు ఈ కుర్ర హీరో.

’18 పేజెస్’ అనే కొత్త సినిమాతో మల్లి ఫాన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. నిఖిల్ కి జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కార్తికేయ 2 తర్వాత అనుపమ పరమేశ్వరన్ మళ్లీ నిఖిల్‌తో జతకట్టింది. ‘కరెంట్’, ‘కుమారి 21ఎఫ్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్ 23, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్స్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా సెన్సార్‌కి U/A తో వచ్చింది.

ఇది ఇలా ఉండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 18 పేజీల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.18 పేజీల గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 19న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరగనుంది. పుష్ప దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు కథను అందించారు. ఈ చిత్ర సాంకేతిక బృందంలో సినిమాటోగ్రఫీకి వసంత్, ఆర్ట్ డైరెక్షన్‌కి రమణ వంక, ఎడిటింగ్‌కి నవీన్ నూలి, సంగీతం గోపి సుందర్ ఉన్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు