NTR: తారా స్థాయికి చేరిన నందమూరి ఫ్యామిలీ పంచాయితీ

ఈ మధ్యకాలంలో నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టిందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని సైడ్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. ఇటీవల తారకరత్న పెద్దకర్మకు సంబంధించిన కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో ఊహించని విధంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొన్ని వీడియోలలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక దగ్గర కూర్చుని ఉండగా బాలకృష్ణ అందరినీ పలకరించి జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రం పలకరించకుండా కనిపించినట్లుగా కామెంట్స్ అయితే వచ్చాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా నందమూరి కుటుంబంలో ఓ శుభకార్యం జరిగింది. దివంగత నటుడు హరికృష్ణ కుమార్తె సుహాసిని కుమారుడైన శ్రీహర్ష ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ కి నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు హాజరయ్యారు.

అలాగే సుహాసిని సోదరుడు కళ్యాణ్ రామ్ సతీసమేతంగా హాజరయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేదు. దీంతో మళ్లీ అనేక అనుమానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండవ భార్య కొడుకు అన్న విషయం తెలిసిందే. ఇక జానకిరామ్, సుహాసిని, కళ్యాణ్ రామ్ ముగ్గురు హరికృష్ణ మొదటి భార్య సంతానం.

- Advertisement -

అయితే జూనియర్ ఎన్టీఆర్ మేనల్లుడు శ్రీహర్ష ఎంగేజ్మెంట్ కి రాకపోవడంతో దీనికి ప్రధాన కారణం వారి మధ్య విభేదాలే అంటూ కొంతమంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ కాస్త బిజీగా ఉండడం వల్లే రాలేకపోయారని చెబుతున్నారు. అయితే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి కూడా రాకపోతే వీరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయని క్లారిటీ వస్తుంది అంటున్నారు మిగతా నెటిజన్స్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు