Koratala Siva: భయం లేని వ్యక్తుల కథే ఈ NTR30

ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తరువాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ వస్తున్న విషయం తెలిసిందే. తారక్ పుట్టిన రోజు సందర్భంగా గతేడాది మే 20న NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారు. అలాగే ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ రోజు నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NTR30 పూజా కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్ లో పూజా కార్యక్రమంతో ఎన్టీఆర్30 ఘనంగా లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి, కేజీఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నవీన్ యెర్నేని, నందమూరి కళ్యాణ్ రామ్ హజరయ్యారు. రాజమౌళి క్లాప్ కొట్టగా, NTR30 దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. మొదటి షాట్ కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ ను శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా అందిచటం జరిగింది.

కాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు సంగీతాన్ని అనిరుధ్ అందించనున్నారు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. ఈ NTR30 మూవీ తీర ప్రాంతం నేపథ్యంలో ఉంటుందని, ఇప్పటి వరకు వచ్చిన మూవీ పోస్టర్ లతో స్పష్టమవుతుంది. తాజాగా డైరెక్టర్ కొరటాల శివ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. “ఇది తీర ప్రాంతంలో ఉండే స్టోరీ. ఇక్కడి మనుషులు.. మనుషుల కంటే మృగాలకు దగ్గరగా ఉంటారు. అలాగే వీరు ఎవరికీ భయపడరు.. అది దేవుడు అయినా, మరణం అయినా. మరి వీరు దేనికి భయపడతారు ? అనేది సినిమాలో చూద్ధాం” అంటూ కొరటాల స్టోరీ చెప్పి ఇంట్రెస్ట్ పెంచాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు