Veera Simha Reddy : ట్రైలర్ పై అధికారిక ప్రకటన

నందమూరి బాలయ్య హీరోగా, శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం వీర సింహా రెడ్డి. క్రాక్ హిట్ తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న వీర సింహా రెడ్డి సంక్రాంతి బరిలో ఉండబోతుంది. ఈ నెల 12న భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. దీని కోసం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు.

ఈ నెల 6వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అనేక అనుమానాలు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరించిందని, దీంతో మూవీ యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఫైనల్ గా ఒంగోలులో వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

తాజాగా వీర సింహా రెడ్డి మూవీ యూనిట్ ట్రైలర్ పై అధికారిక ప్రకటన చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలోనే అంటే.. ఈ నెల 6వ తేదీ రాత్రి 8 : 17 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా వీర సింహా రెడ్డి ట్రైలర్ గురించి నందమూరి అభిమానులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ మోస్ట్ అవెయిటెడ్ ట్రైలర్ ని చూడాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు