Naga Chaitanya : రిస్క్ అనుకుంటున్నాడా ?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక రకమైన పరిస్థితి నెలకొంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్నాయి. దీంతో ప్రేక్షకుల టెస్ట్ కు అనుగుణంగా సినిమాలు చేయాలని హీరోలు చూస్తున్నారు. దీనిలో అక్కినేని నట వారసుడు నాగ చైతన్య ముందున్నాడు. థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా ఫలితాలతో చైతన్య జాగ్రత్త పడుతున్నాడు. ఇక ముందు వచ్చే సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. రిస్క్ అనే ప్రాజెక్ట్ లను పక్కకు పెట్టడానికి కూడా వెనకాడటం లేదని తెలుస్తుంది.

నాగ చైతన్య థాంక్యూ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది. అయితే ఈ ప్రాజెక్ట్ పై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి. నిజానికి పరశురామ్-నాగ చైతన్య కాంబోలో సినిమా రెండేళ్ల క్రితమే రావాల్సింది. ఈ కాంబో సినిమాను నిర్మించడానికి 14 రీల్స్ బ్యానర్ కూడా ముందుకు వచ్చింది. అన్ని ఫైనల్ అయ్యాయి. పట్టాలెక్కడమే తరువాయి అనుకునే సమయంలో పరశురామ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబుతో అవకాశం వచ్చింది. దీంతో చైతన్యను 14 రీల్స్ సంస్థను ఒప్పించి మహేష్ తో సర్కారు వారి పాటను తెరకెక్కించాడు పరశురామ్.

భారీ అంచనాలతో విడుదలైన సర్కారు వారి పాట కమర్షియల్ గా సక్సెస్ అయింది. కానీ, నెగిటివ్ రివ్యూలను తెచ్చుకుంది. మహేస్ కు సరిపోయే సినిమా కాదని సినీ ప్రేక్షకులు, అభిమానులు అభిప్రాయపడ్డారు. ఆ మాత్రం కలెక్షన్లు కూడా మహేష్ క్రేజ్ తోనే వచ్చాయని చెప్పొచ్చు. దీని తర్వాత పరశురామ్ సినిమా అంటే నాగ చైతన్య ఆలోచిస్తున్నాడట. అయితే చైతన్యకు థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలు విజయం సాధిస్తే పరశురామ్ తో సినిమా ఉండేది కావచ్చు. కానీ, వరుసగా రెండు సినిమాలు నిరాశపరిచాయి. దీంతో తర్వాత వచ్చే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా ఉండాలని చైతన్య ప్రయత్నిస్తున్నాడు.

- Advertisement -

ఈ టైం పరశురామ్ తో రిస్క్ చేయడం సరికాదని చైతన్య భావిస్తున్నాడని సమాచారం. దీంతో పరశురామ్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాలని ఈ అక్కినేని హీరో నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు