షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం పఠాన్. ఐదేళ్ల కిందట ‘జీరో’ సినిమాలో నటించాడు షారూఖ్. దీని తర్వాత కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు మాత్రమే చేశాడు. కానీ పూర్తి స్థాయి సినిమాలకు దూరంగా ఉన్నాడు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తరువాత షారూఖ్ ఖాన్ హీరోగా చేస్తున్న చిత్రం పఠాన్. షారూఖ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ లో షారూఖ్ ఖాన్ అదరగొట్టేశాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రాహం కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
అదేవిధంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న చిత్రం ఆదిపురుష్. దీనికి బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిపురుష్ సినిమా పై నార్త్ లో కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ సినిమాని ఢీ కొట్టే సినిమాలు బాలీవుడ్ నుంచి వస్తాయనుకున్నారు. కానీ ఏ సినిమా ఆ రేంజ్కి వెళ్లలేదు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం పఠాన్ విషయంలో ఆ పరిస్థితి కనిపించింది. కానీ అనుకున్న కం బ్యాక్ షారూఖ్ నుంచి కనిపించలేదనే చెప్పాలి.
అందుకు ఉదాహరణ.. నిన్న విడుదల చేసిన పఠాన్ టీజర్కి వచ్చిన స్పందననే. అంత నెగిటివ్ టాక్ వచ్చిన ఆదిపురుష్ టీజర్ రెస్పాన్స్ లో సగం కూడా రాకపోవడం గమనార్హం. ఆదిపురుష్ టీజర్కి గడిచిన 24 గంటల్లో హిందీలోనే 68.91 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పఠాన్కి హిందీలో కేవలం 17.1 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. దీంతో ఆదిపురుష్ దరిదాపుల్లో కూడా పఠాన్ లేదనే చెప్పవచ్చు.
ఆదిపురుష్ సినిమా 68.91 మిలియన్ వ్యూస్ తో మొదటి స్థానంలో కొనసాగగా.. రెండో స్థానంలో ప్రభాస్ నటించిన సాహో సినిమా 22.5 మిలియన్ వ్యూస్తో కొనసాగుతుంది. షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా 17.1 మిలియన్ వ్యూస్తో 6వ స్థానంలో కొనసాగుతుంది. సాహో సినిమా నుంచి ఇప్పటివరకు ప్రభాస్ రికార్డును ఎవరు క్రాస్ చేయలేదనే చెప్పవచ్చు. మొత్తానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్లో కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.