Pawan : వీరమల్లుకు ముహూర్తం ఫిక్స్

పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రాబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్, అర్జున్ రామ్ పాల్ నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చబోతున్నారు. మొగలుల సామ్రాజ్యం కాలం నాటి నేపథ్యంలో ఒక చారిత్రాత్మకమైన సంఘటన తీసుకొని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వివిధ కారణాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. వీటికి తోడు మధ్యలో పవన్ కళ్యాణ్ ఇతర సినిమా షూటింగ్స్ చేయాల్సి వచ్చింది. అలాగే రాజకీయ కారణాల వలన కూడా అనుకోకుండా గ్యాప్ ఇచ్చాడు. అయితే ఈ క్రమంలో ఇటీవల మళ్ళీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలి అని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

షూటింగ్ సరిగ్గా జరగడం లేదని, క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. ఇక అందులో ఎలాంటి నిజం లేదు అని నిర్మాత ఎ ఎం రత్నం క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా విడుదల డేట్ పై కొనసాగుతున్న సస్పెన్స్ కు మొత్తానికి తెరదించారు. వచ్చే ఏడాది మార్చి 30న హరిహర వీరమల్లు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. కాగా రామ్ చరణ్ తన కెరీర్ లో బెస్ట్ సక్సెస్ అందుకున్న రంగస్థలం సినిమా కూడా ఇదే రోజు వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు