OG: అప్పుడే మూడో షెడ్యూలా? సుజీత్ మామూలోడు కాదు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ మీదున్నాడు. ఒకవైపు జనసేన పార్టీ పనుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు పూర్తి చేస్తున్నాడు. భీమ్లా నాయక్ తరువాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా నాలుగు సినిమాల షూటింగ్ లతో బిజీ గా ఉన్నాడు. ఇప్పటివరకు ఒకేసారి రెండు సినిమాలు కూడా చేయని పీకే ఇప్పుడు ఇన్ని సినిమాలు ఒకేసారి షూట్ చేస్తుండడం విశేషం. వీటిలో ఇప్పటికే సముద్రఖనితో చేస్తున్న “బ్రో” షూటింగ్ పూర్తయిపోగా జులై లో విడుదలకు సిద్ధం అవుతుంది. మొన్నటివరకు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు “ఓజి” షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడు.

“సాహో” ఫేమ్ సుజిత్ “ఓజి” సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో భారీ అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ నాలుగు సినిమాల్లో ఓజి పైనే ఎక్కువ ఎక్స్పెక్టషన్స్ ఉన్నాయి. అందువల్ల సుజీత్ ఈ సినిమాపై చాలా శ్రద్ధ పెట్టాడు. అంతేకాక గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలను అవధులు దాటిపోయాయి. ఇక ఇప్పటికే ఓజి కి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయిపోగా, ఇప్పుడు మూడో షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టబోతున్నారు.

అయితే మాములుగా సినిమా సినిమాకి గ్యాప్ ఇస్తూ రాజకీయాల్లోనూ బిజీగా ఉండే పవన్ ని ఇప్పుడు ఈ సినిమా షూట్ లో రెగ్యులర్ గా పాల్గొనడానికి డైరెక్టర్ సుజీత్ పీకే ని ఎలా ఒప్పించాడని ట్రేడ్ విశ్లేషకులు ఆశ్యర్యపోతున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే సినిమా మాత్రం 2024 చివర్లో, లేదా 2025 లోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దీనికంటే ముందు పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు విడుదల కావాల్సి ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు