Pawan Kalyan : ఫైనల్ గా సినిమాలపై దృష్టి

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా “హరిహర వీరమల్లు”. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాని మొగలాయిల కాలం నాటి కథతో తెరకెక్కిస్తున్నారు. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. ఏం ఏం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చబోతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ తన రాజకీయ పనుల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అంతే కాకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఈ దసరా నుండి బస్సు యాత్ర మొదలుపెట్టాలనుకున్నారు. కానీ, ప్రస్తుతం ఈ బస్సు యాత్ర వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయాన్ని సినిమాలకు కేటాయించాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పనులు ఇంకా చాలానే మిగిలిపోయాయి. ఈ చిత్రం సెట్స్ పైకి వచ్చి ఇప్పటికీ చాలా కాలం గడిచింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఫైనల్ గా బస్సు యాత్ర వాయిదా వేయడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై దృష్టి పెట్టినట్టు సమాచారం. దీంతో అక్టోబర్ నెలలో హరిహర వీరమల్లు షూట్ లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా వచ్చిన యాక్షన్ గ్లీంప్స్ తో మంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు