Pooja Hegde: నేను డబ్బుల కోసం పని చేస్తానా?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకెళ్తుతుంది. ఇప్పటికే రాధేశ్యామ్, బీస్ట్ తో పాటు ఎఫ్3 సినిమాల్లో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. తాజాగా బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో సర్కస్ అనే సినిమా చేసింది. ఇది ఈ నెల 23న విడుదల కానుంది. అంటే 2022లో మొత్తం నాలుగు సినిమాల్లో బుట్టబొమ్మ నటించింది. ఇందులో రాధేశ్యామ్, బీస్ట్ వంటి సినిమాలు ఫెయిల్ అయినా పూజాకు అవకాశాలు తగ్గడం లేదు.

ప్రస్తుతం పూజా హెగ్డే కిసీ కా భాయ్ కిసీ కి జాన్, SSMB28 సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరి కొన్నికొత్త సినిమాలు సైన్ చేసిందని సమాచారం. ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి పూజా హెగ్డే రెమ్యూనరేషన్ గురించి తెగ చర్చ జరుగుతుంది. ఈమె అధికంగా పారితోషికం తీసుకుంటుందని కొంత మంది నిర్మాతలు కూడా బహిరంగంగా చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. బుట్టబొమ్మ తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేసిందని, దీంతో నిర్మాతలు ఈమెను హీరోయిన్ గా ఎంచుకోవడానికి జంకుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై తాజాగా పూజా హెగ్డే స్పందించింది. “నా రెమ్యూనరేషన్ పై వస్తున్న వార్తలు అర్థం లేనివి. నేను డబ్బుల కోసం పని చేస్తానా ? నేనే కాదు.. గుర్తింపు వచ్చిన వారు ఎవరు కూడా డబ్బుల కోసం పని చేయరు. పేరు వచ్చాకా, దాన్ని కాపాడుకోవడానికి మంచి పాత్రలు, మంచి స్టోరీలు చేస్తారు. అంతే కానీ డబ్బు కోసం సినిమాలు చేయరు. నేను రెమ్యూనరేషన్ ల గురించి ఆలోచించే టైప్ కాదు. ఒక్కో సినిమా కోసం ఆరు నుంచి ఏడు నెలల వరకు కష్టపడతాం. ప్రతి రోజు సెట్ లో ఇష్టంగా పని చేయాలంటే కావాల్సింది డబ్బులు ఒక్కటే కాదు” అంటూ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు