Pooja Hegde: సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రెమ్యునరేషన్ తగ్గలేదు, పెరిగింది

Pooja Hegde: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న మెగా హీరోస్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ముకుంద సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన అదే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది పూజ హెగ్డే. ఆ తర్వాత పూజ హెగ్డే అనేక సినిమాలు చేసి తనకంటూ మంచి పేరు సాధించుకుంది.

Pooja Hegde

అల్లు అర్జున్ సరసన చేసిన డీజే సినిమా పూజా హెగ్డే కి మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ తర్వాత గద్దలకొండ గణేష్ సినిమా కూడా పూజ హెగ్డే కెరియర్ లో మంచి హిట్ అయింది. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అరవింద సమేత వీర రాఘవ, అలవైకుంఠపురంలో సినిమాలు పూజా హెగ్డే కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. మహేష్ బాబు ,ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి మంచి పేరును సాధించుకుంది పూజ హెగ్డే.

- Advertisement -

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పూజా హెగ్డే కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కూడా పూజ హెగ్డే నటించాల్సి ఉంది. కానీ కొన్ని తెలియని కారణాల వలన పూజ హెగ్డే ఆ సినిమా నుంచి తప్పుకుంది. అయితే రీసెంట్ గా పూజ హెగ్డే తో కొంత షెడ్యూల్ కూడా పూర్తి చేసింది చిత్ర యూనిట్. దానికి సంబంధించిన ఫోటోలు కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన ఫొటోల్లో పూజ హెగ్డే చాలా అందంగా కనిపిస్తుంది.

ఇకపోతే పూజ హెగ్డే సినిమా చేసి చాలా రోజులైంది అని చెప్పొచ్చు.పూజా హెగ్డే నటించిన “కీసీ కా భాయ్ కీసీ కా జాన్” సినిమా హిందీలో పర్లేదు అనిపించుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక ప్రాజెక్టు కూడా సైన్ చేయలేదు పూజా హెగ్డే. ఇక రీసెంట్ గా వస్తున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే “సంకీ” చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాద్వాలా నిర్మించనున్నారు. అలానే ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ అనే సినిమాలో నటిస్తుంది పూజ హెగ్డే. ఇకపోతే ప్రస్తుతం పూజ హెగ్డే రెమ్యూనరేషన్ మూడు కోట్ల 50 లక్షల వరకు ఉంది. ఈ సినిమాకు సంబంధించి నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు