Pooja Hegde : గురూజీ సినిమా నుంచి అవుట్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ SSMB 28. టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటి మహేష్, త్రివిక్రమ్ సినిమా. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా వంటి సినిమాల తరువాత ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ సినిమాలో మహేష్ కెరీర్ లోనే తొలిసారి డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారని టాక్ వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో మరో మహేష్ బాబు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను గురూజీ తీసుకున్న విషయం తెలిసిందే. కానీ పూజా హెగ్డే మాత్రం ఈ సినిమాలో నటించడానికి సిద్ధంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

గత నెల చివరి వారంలో తనకు కాలికి గాయమైనట్లుగా పూజా హెగ్డే ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంకా పూజా హెగ్డే కాలి గాయం మానలేదని, దీంతో మహేష్ – త్రివిక్రమ్ కాంబో మూవీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చాయి.

- Advertisement -

అయితే పూజా హెగ్డే సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. గురూజీ సినిమా నుంచి పూజా హెగ్డే వెళ్లిపోలేదట. అంతే కాదు పూజా కాలు గాయం తగ్గిన తర్వాత రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ కానుందని సమాచారం. అది తప్పకుండా డిసెంబర్ మొదటి వారంలోనే ఉంటుందని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు