Pooja Hegde : నాకు డబ్బు కంటే అదే ముఖ్యం

పూజ హెగ్డే, నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ, ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైనా ముకుందా సినిమాతో మరింత దగ్గర అయింది. అయితే ఇటీవల పూజ హెగ్డే కాలుకు గాయమైన సంగతి తెలిసిందే. ఓ హిందీ సినిమా షూటింగ్ లో పూజ హెగ్డే గాయపడింది. దీంతో ఆమె గత కొన్ని వారాలుగా చికిత్స తీసుకుని కోలుకుంది. ప్రస్తుతం ఈ భామ ఓ హిందీ సినిమాతో పాటు తెలుగులో మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది.

అయితే ప్రస్తుతం ఈ భామకు అంత బ్యాడే జరుగుతుంది. ఈ మధ్య పూజా హెగ్డే పరిస్థితి ఏం బాగాలేదు. ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న పూజకు వరుస ప్లాపులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయట. అంతేకాకుండా రెమ్యూనరేషన్ విషయంలోనే తగ్గేదేలే అంటూ వ్యవహరిస్తుందని, అందుకే పూజకు ఆఫర్స్ కూడా తగ్గిపోయినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

తాజాగా ఈ వార్తపై స్పందించిన పూజ అవన్నీ అవాస్తవాలేనని తేల్చేసింది. డబ్బు కోసమే సినిమాలు చేయట్లేదని, కథ, పాత్ర నచ్చితే రెమ్యూనరేషన్ గురించి అంతగా ఆలోచించను అంటూ స్పష్టం చేసింది. ఒకవేళ తనకు డబ్బే ముఖ్యం అనుకుంటే ఇప్పటికే చాలా సినిమాలు చేతిలో ఉండేవని, తాను మంచి కథ కోసమే చూస్తాను అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు