Prabhas : భోజనం చేసి వెళ్లండి డార్లింగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక బాహుబలి సినిమాతోనే పాన్ వరల్డ్ హీరో అయిపోయాడు. ప్రభాస్ ఒక మంచి హీరోనే కాదు.. మంచి మనసు ఉన్న వాడు కూడా. ఈ విషయం చాలా సార్లు బయట ప్రపంచానికి తెలిసింది. ముఖ్యంగా ప్రభాస్ ఆతిథ్యం అంటే.. ఒక రేంజ్ లో ఉంటుంది. ఎవరైన తన వద్దకు వస్తే.. “భోజనం చేసి వెళ్లండి డార్లింగ్” అని ప్రభాస్ నోటి నుంచి రాక మానదు.

ఇటీవల ప్రభాస్ కు పెద్ద దిక్కు, పెద్ద నాన్న కృష్ణం రాజు అకాల మరణం ఆయనను బాగా కలిచివేసింది. కృష్ణం రాజు ఆనారోగ్యంతో ఉన్ననాటి నుంచి ఇప్పటి వరకు కుటుంబంతోనే ఉన్నాడు. గురువారం రోజు కృష్ణం రాజు స్వస్థలం మొగల్తూరులో ఒక భారీ సంస్మరణ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సభకు దాదాపు 75 వేల మంది రాబోతున్నారు. వారందిరికీ భోజనాలు పెట్టాలని ప్రభాస్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ప్రమోషన్ల ను అక్టోబర్ నుంచి ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఆదిపురుష్ టీజర్ ను అక్టోబర్ 2న ఆయోధ్యలో విడుదల చేయనున్నారు. సరయు నది ఒడ్డున ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి అభిమానులు భారీ సంఖ్యలో వస్తారు. వారిని ఊరికే పంపించకుండా.. అందరికీ భోజనాలు, నీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని మూవీ టీంను ప్రభాస్ కోరారట.

- Advertisement -

ప్రభాస్ కోరికతో మూవీ టీం కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అభిమానులకు భోజనం పెట్టేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది తెలిసిన రెబల్ స్టార్ అభిమానులు.. ప్రభాస్ వద్దకు వెళితే ఆయన ఆతిథ్యం తీసుకోకుండా రాగలుగుతామా అంటూ నెట్టింట్లో కామెంట్ చేస్తున్నారు. ఇలా వచ్చే ప్రతి ఫ్యాన్ ను “భోజనం చేసి వెళ్లండి డార్లింగ్” అని చెప్పే ప్రభాస్.. ఇప్పుడు మరో మెట్టు ఎక్కేశాడు అంటూ పొగుడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు