Prabhas : లెక్కలు సెట్ చేస్తాడా ?

ప్రస్తుతం అటు టాలీవుడ్ లో ఇటు బాలీవుడ్ అత్యంత బిజీగా ఉన్న హీరో ఎవరంటే.. టక్కున పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చెబుతారు. రాధేశ్యామ్ తర్వాత డార్లింగ్ వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ తో పాటు మారుతి దర్శత్వంలో రాబోయే మరో సినిమా ఉంది. ఇందులో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు.

ఆది పురుష్ షూటింగ్ పూర్తి అయింది. కానీ, వీఎఫ్ఎక్స్ పనుల్లో నాణ్యత లోపించాయి అనే విమర్శలు రావడంతో, రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుని, మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. ఇక ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాల షూటింగ్ సగానికి పైగా మూగిసింది. స్పిరిట్ ఇంకా స్టార్ట్ కాలేదు. మారుతి సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. ప్రభాస్ నాన్ స్టాప్ గా షూటింగ్ చేసినా.. ఈ సినిమాలు పూర్తి అవడానికి దాదాపు రెండేళ్లకు పైగా సమయం పడుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ మరో సినిమాకు సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లెక్కాల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ మూవీ చేయడానికి అగ్రిమెంట్ కుదిరిందని టాలీవుడ్ వర్గాల్లో విస్తృతమైన చర్చ సాగుతుంది. ఈ సినిమా 2024లో సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. అలాగే దీనికి అభిషేక్ అగర్వాల్ నిర్మాత వ్యవహరించబోతున్నాట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

కాగా డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ నెల 24 నుంచి ఈ పాన్ ఇండియా స్టార్ మారుతి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దీన్ని పూర్తి చేసిన తర్వాతే ఇతర సినిమాల సెట్స్ పైకి ప్రభాస్ వెళ్లనున్నారని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు