Project K : రెండు పార్ట్‌లా.. నిజమేంతా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూర్తి సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా రానుండడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాలలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కనున్నట్లు న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే దిశగా చిత్రబృందం ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అశ్విని దత్ వైజయంతి మూవీస్ నుండి ప్రాజెక్ట్ కే పై అప్డేట్ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపించాయి.

అయితే ఈ సినిమాని ముందుగా 2024 ఏప్రిల్ లో చేయాలని చిత్ర యూనిట్ భావించగా.. త్వరలోనే రెండు పార్టుల గురించి ప్రకటిస్తూ, రిలీజ్ డేట్ ని కూడా మార్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.

- Advertisement -

అయితే ఈ వార్తలలో నిజం లేదని సమాచారం అందుతుంది. ఈ సినిమా కేవలం ఒక భాగమేనని విశ్వసనీయ వర్గాలనుంచి సమాచారం. ఇప్పటికే దాదాపు 85% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించుకొని 2024లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తిగా బ్లూ మ్యాట్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నారు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు