Prabhas: ఊహించని కంబో లో…

బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడనే ప్రచారం కొంతకాలంగా జరుగుతూ వస్తుంది. ఇది నిజమే అంటూ ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అంతేకాదు ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా అని ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది.

ఇండియాలోనే టాప్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ప్రభాస్, టైగర్ శ్రాఫ్ ఈ మూవీలో కలిసి పని చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కాంబో పై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ ముగ్గురిని ఒకే స్క్రీన్ పై చూపించాలని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిద్ధార్థ ఆనంద్ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో తీసిన పటాన్ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది.

ఇక ప్రస్తుతం సిద్ధార్థ్, హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం ఫైటర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రభాస్ తో ఒప్పుకున్న సినిమా పనులు మొదలుపెట్టనున్నాడు. ప్రభాస్ తో పాటు ఈ చిత్రంలో అతిథి పాత్రలో హృతిక్, టైగర్ ని చూపించాలని సిద్ధార్థ్ అనుకుంటున్నారట.

- Advertisement -

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ముగ్గురు హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులకు కన్నుల పండగ వలే ఉంటుందటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఇటీవలే సంక్రాంతికి రెండు పెద్ద విజయాలను అందుకుని టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలికే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు