Prabhas : వారం రోజుల్లోనే..

రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇటీవల ఆనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. పెద్దనాన్న మరణంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా బాధలో ఉన్నాడు. కృష్ణం రాజు చనిపోయిన నాటి నుంచి కుటుంబంతోనే ఉంటున్నాడు. ప్రభాస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఈ భాద నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ నె 29వ తేదీన కృష్ణం రాజు సొంత గ్రామం మొగల్తూరు లో స్మారక సభ నిర్వహించనున్నారని సమాచారం. ఈ సభ సమయంలో 70 వేల మందికి ప్రభాస్ భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇది ఇలా ఉండగా, ప్రభాస్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు కూడా ఎదురుచూస్తున్నాయి. డార్లింగ్ ఏక కాలంలో సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. సలార్ షూటింగ్ లో భాగంగా ఈ నెల 19వ తేదీన ప్రభాస్ సీన్స్ చిత్రీకరించడానికి 12 సెట్స్ వేసి సిద్ధంగా ఉంచారట. ప్రతి సెట్ లో 2 నుండి 3 రోజుల పాటు షూటింగ్ ఉంటుందట. అయితే ఇంతలోనే కృష్ణం రాజు చనిపోవడంతో షూటింగ్స్ అన్ని రద్దు అయిపోయాయి. దీంతో సెట్స్ అద్దే భారం పెరిగిపోతుందని తెలుస్తుంది.

దీనిని తగ్గించడానికి ప్రభాస్ అనుకన్న దాని కంటే ముందుగానే సెట్స్ పైకి రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది. కాగా సలార్ ను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు