హీరో విశాల్ తమిళంలో ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగు అభిమానులు టాలీవుడ్ హీరో మాదిరిగానే భావిస్తుంటారు. కెరీర్ ప్రారంభంలో ఉన్న జోరు ఇప్పుడు విశాల్ వద్ద నుంచి కనిపించడం లేదనే చెప్పాలి. ఈమధ్య కాలంలో విశాల్ నటిస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయే తప్ప సూపర్ హిట్ మాత్రం కావడంలేదనే చెప్పాలి.
తాజాగా హీరో విశాల్, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ హాట్ టాపిక్ గా మారారు. విశాల్ పై ప్రకాశ్ రాజ్ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విశాల్ కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాడు. గంగానదిలో పూజలు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ప్రధాని మోడీ కాశీ పుణ్యక్షేత్రాన్ని ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేశారని ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జీ కూలి వందలాది మంది మరణించారు.
కేబుల్ బ్రిడ్జీ పై స్పందించని విశాల్.. మోడీని పొగుడుతారా అని ట్రోలింగ్ చేశారు. తాజాగా ప్రకాశ్ రాజ్ షాట్ ఒకే.. నెక్ట్స్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేశాడు. అయితే విశాల్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించడంతోనే అతనిపై ప్రకాశ్ రాజ్ ఇలా సెటైర్లు వేశారు. కొందరూ నెటిజన్లు అనవసరంగా ఎందుకు విశాల్ని లాగుతున్నారని ప్రకాశ్ రాజ్ని ప్రశ్నించడం విశేషం. మొత్తానికి ఏది ఏమైనా ఇద్దరు సినీ స్టార్లు ట్వీట్లు చేసి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారనే చెప్పాలి.
Shot Ok…. Next ??? … #justasking https://t.co/uybmBFVSwZ
— Prakash Raj (@prakashraaj) November 3, 2022