Priyanka Arul Mohan : రెమ్యూనరేషన్ పెంచేసిన “గ్యాంగ్ లీడర్” హీరోయిన్

నాచురల్ స్టార్ నాని – విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ ప్రియాంక అరుళ్ మోహన్. తన నటనతో హోమ్లీగా కనిపించి అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత శర్వానంద్ శ్రీకారం సినిమాలో కూడా నటించింది. “వస్తానంటివో పోతానంటివో ” అనే ఫోక్ సాంగ్ లో పక్కా పల్లెటూరు అమ్మాయిలా కనిపించి, కళ్ళతోనే హావాభావాలు పలికించే నటన తన సొంతం అని నిరూపించుకుంది ఈ సుందరి. అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ ఈ భామ రచ్చ గెలిచి ఇంట గెలిచే ప్రయత్నంలో ఉంది. తెలుగులో నటించిన ఈ రెండు చిత్రాలు అంత హిట్ సాధించకపోయినా ఈమెకి కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది.

అక్కడే ఈ బ్యూటీకి లక్కు కలిసి వచ్చింది. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో దూకుడుమీదుంది. అయితే మూడు భాషల్లో ప్రియాంక నటించిన చిత్రాలు కేవలం అరడజను మాత్రమే అయినప్పటికీ భారీ మొత్తంలో పారితోషకం పుచ్చుకుంటుందని తాజా సమాచారం. రెండు శతాబ్దాలుగా పలు భాషలలో నటిస్తూ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త్రిశ లాంటి వారు కూడా మొన్నటి వరకు కోటి రూపాయల కంటే ఎక్కువ పారితోషకాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా కన్నడ భామలు కృతి శెట్టి, శ్రీ లీలలు రెమ్యూనరేషన్ మొదటి సినిమా తర్వాత 20% పెంచారని టాక్ నడుస్తోంది. ప్రియాంక మోహన్ మాత్రం టాప్ హీరోయిన్లకు సమానంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈమె ధనుష్ కు జంటగా ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు