బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నటీమణుల్లో ఈమెది ప్రత్యేక స్థానం. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక తర్వాత కొన్ని హాలీవుడ్ సినిమాలు చేసి గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. అయితే పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్ లో సెటిలైంది ఈ బాలీవుడ్ భామ. ఇటీవల ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
అయితే దాదాపు మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు ఇటీవలే ఇండియాకు వచ్చింది. అయితే తన కెరీర్ లో జరిగిన కీలక సంఘటనలను అభిమానులతో పంచుకుంది ప్రియాంక చోప్రా. తన కెరీర్ ప్రారంభంలో బాడీ షేమింగ్ కి గురైనట్లు వెల్లడించింది. తనకి ఇండస్ట్రీలో ఈజీగా అవకాశాలు రాలేదని.. కెరీర్ స్టార్ట్ చేసిన రోజుల్లో తనకి చాలా అవమానాలు ఎదురైనట్లు చెప్పుకొచ్చింది.
“కెరీర్ ప్రారంభంలో సహనటుల కోసం గంటల తరబడి వేచి ఉండేదాన్ని. నన్ను డస్కీ అని పిలిచేవారు. అంతేకాకుండా నల్ల పిల్లి అని వెటకారంగా పిలిచేవారు. డస్కీ అంటే ఏమిటో నాకు తెలియదు. నేను తగినంత అందంగా లేనని అప్పుడు అనిపించింది. నా సహనటులు పొందిన వేతనంలో 10% కూడా నేను పొందలేదు. నేను చాలా కష్టపడి పని చేయవలసి ఉంటుందని నమ్మకంతో ఉండే దానిని. నా ఫిల్మ్ కెరీర్ ని చంపేయడానికి చాలా ట్రై చేశారు” అని సంచలన విషయాలను వెల్లడించింది ప్రియాంక చోప్రా.
అయితే ప్రస్తుతం తాను హాలీవుడ్ వరకు వెళ్లానని చెప్పుకొచ్చింది. తనను ఎగతాళి చేసిన వారి కంటే తాను ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నాని తెలిపింది.