Puri : ఒక్క రూపాయి కూడా ఇవ్వను

టాలీవుడ్ మాస్ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌-విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో లైగ‌ర్ సినిమా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితం అందుకోలేక‌పోయింది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించిన‌ప్ప‌టికీ న‌ష్టాల‌ను మిగిల్చింది. ఈ సినిమా ఫెయిల్ కావ‌డంతో ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తూ వ‌చ్చాయి.

లైగ‌ర్ మూవీతో ద‌ర్శ‌కుడు పూరితో పాటు బ‌య్య‌ర్స్ కూడా భారీగానే న‌ష్ట‌పోయార‌ట‌. సినిమా న‌ష్ట‌పోవ‌డం వ‌ల్ల త‌మ ప‌రిస్థితి ఏంట‌ని బ‌య్య‌ర్స్ అడ‌గ‌డంతో అంద‌రికీ న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని పూరి చెప్పారు. ఆంధ్రాకి రూ.6కోట్లు, నైజాంకి రూ.4.5 కోట్లు, సీడెడ్‌కి రూ.2.25 కోట్లు వెన‌క్కి ఇవ్వ‌డానికి నిర్మాత‌లు పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీలు అంగీక‌రించార‌ట‌.  తాజాగా డిస్ట్రిబ్యూటర్లు ధర్నా చేస్తామని ప్రకటించడంతో పూరి జగన్నాథ్ కాస్త ఆగ్రహానికి గురయ్యారు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్‌కి సంబంధించిన ఓ ఆడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

”ఏంటీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..? నేను ఎవ్వ‌రికీ తిరిగి డ‌బ్బు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. అయినా ఇస్తున్నాను ఎందుకు ?  వాళ్లు కూడా న‌ష్ట‌పోయారులే అని ఇస్తున్నాను. ఇస్తాను అని చెప్పిన త‌రువాత కూడా అతి చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వ‌బుద్ది కాదు. నా ప‌రువు తీయాల‌ని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌ను. నాకు పోకిరి ద‌గ్గ‌ర నుంచి ఇస్మార్ట్ శంక‌ర్ వ‌ర‌కు బ‌య్య‌ర్స్ ద‌గ్గ‌ర నుండి రావాల్సిన డ‌బ్బులు ఎన్నో ఉన్నాయి. బ‌య్య‌ర్స్ అసోసియేష‌న్ నాకు ఆ అమౌంట్ వ‌సూలు చేసి పెడ‌త‌దా ? ధ‌ర్నా చేస్తాం అంటున్నారు చేయండి. ధ‌ర్నా చేసిన వారి లిస్ట్ తీసుకొని.. వాళ్ల‌కి త‌ప్ప మిగ‌తా వాళ్లంద‌రికీ డ‌బ్బు ఇస్తా” అంటూ పూరి కోపంతో మాట్లాడిన ఈ ఆడియో సినీ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తుంద‌నే చెప్పాలి. దీంతో డిస్ట్రిబ్యూట‌ర్లు ధ‌ర్నా చేస్తారా లేదా వెన‌క‌డుగు వేస్తారో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు