Rajinikanth : మరోసారి గెస్ట్ రోల్

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తున్నారు. ప్ర‌స్తుతం ర‌జినీకాంత్ నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జైల‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు. రజనీకాంత్ నటిస్తున్న169వ సినిమా ఇది. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ సరికొత్తగా క‌నిపించ‌నున్నార‌ట‌. ఈ సినిమా త‌రువాత త‌లైవా లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో మ‌రో రెండు సినిమాలు చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌లే అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే.

ర‌జినీకాంత్ హీరోగానే కాకుండా గెస్ట్ రోల్‌లో కూడా చాలా సినిమాల్లో నటించారు. టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ న‌టించిన పెద‌రాయుడు చిత్రంలో ర‌జినీకాంత్ గెస్ట్ రోల్‌లో న‌టించి అద్భుతాన్ని సృష్టించారు. జ‌గ‌ప‌తి బాబు న‌టించిన క‌థానాయ‌కుడు సినిమాలో కూడా ర‌జినీకాంత్ గెస్ట్ రోల్ లో క‌నిపించారు. తాజాగా ర‌జినీకాంత్ కూతురు సౌంద‌ర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించే 170వ సినిమాలో కూడా ర‌జినీకాంత్ స్పెష‌ల్ రోల్‌లో న‌టించ‌నున్నారు.

ఈ చిత్రానికి లాల్ స‌లామ్ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు ఫ‌స్ట్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. విష్ణు విశాల్‌, విక్రాంత్ సంతోష్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్ నిర్మిస్తోంది. ఏ.ఆర్‌.రెహ్మాన్ సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నారు. ఈ చిత్రం ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ డ్రామాగా కొన‌సాగనుంది. గ‌తంలో ఐశ్వ‌ర్య త్రీ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ సినిమాలో ధ‌నుష్ హీరోగా న‌టించారు. ర‌జినీ స్పెష‌ల్ రోల్ చేసే ఈ సినిమా సూప‌ర్ హిట్ అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం ఎదురు చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు