Rakul Preet Singh: అందుకే నాకు తెలుగులో ఫ్యాన్స్ తగ్గిపోయారు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల తార. అనంతరం స్టార్ హీరోలు అందరి సరసన కలిసి నటించింది. ప్రస్తుతం తెలుగులో కాస్త జోరు తగ్గించి బాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్కడ స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది రకుల్ ప్రీత్ సింగ్.

ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తనకు సంబంధించిన విషయాలను, హాట్ ఫోటోలను, జిమ్ వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ కుర్ర కారును మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. అయితే 2021 లో వచ్చిన కొండపోలం చిత్రం తర్వాత రకుల్ మళ్లీ తెలుగు సినిమాలో నటించలేదు. ఈ సినిమా తర్వాత పూర్తిగా బాలీవుడ్ కు మకాం మార్చిన ఈ చిన్నది అక్కడే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారింది.

అయితే ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నప్పటికీ అది స్ట్రైట్ తెలుగు మూవీ కాదు. దీంతో రకుల్ తెలుగు సినిమాలలో ఎందుకు నటించడం లేదని వార్తలు షికార్లు చేశాయి. రకుల్ పూర్తిగా తెలుగు సినిమాలకు పులిస్టాప్ పెట్టిందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విషయంపై రకుల్ స్పందిస్తూ.. ” టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లినప్పటి నుండి నాకు తెలుగు, తమిళంలో అభిమానులు తగ్గిపోయారు. టైం లేకపోవడంతో సౌత్ ఇండియాలో అనేక ప్రాజెక్టులకు ఓకే చెప్పలేకపోయాను. మున్ముందు ఏదైనా సినిమా చేసేందుకు సమయం దొరుకుతుందని ఆశిస్తున్నాను” అని పేర్కొంది రకుల్ ప్రీత్ సింగ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు