విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రారంభంలో కాస్త తడబడినా ఆ తరువాత ‘ఫలక్నుమా దాస్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వక్ సేన్. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘ఓ మై కడువలే’ చిత్రాన్ని రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వెంకటేష్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా మిథిలా పల్కర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలై టీజర్, సాంగ్స్, ట్రైలర్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా రానున్నారట. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో రేపు నిర్వహించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్తో ఓ భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకుంటుందట. రామ్ చరణ్ రాజమండ్రిలోనే ఉండడంతో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరవుతున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.