దళపతి విజయ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్ గా టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం వరిసు. తెలుగులో ఈ సినిమా వారసుడిగా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రంజితమే’ సాంగ్ తాజాగా విడుదల చేశారు.
తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్లో దళపతి విజయ్, రష్మిక మందన్న ఇద్దరూ పోటీపోటీగా డ్యాన్స్ చేసి అదరగొట్టారనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఎం.ఎం.మానసితో కలిసి విజయ్ స్వయంగా పాడిన హై బీట్లు, ఎనర్జిటిక్ గానం అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటకు వివేక్ సాహిత్యం అందించారు. ఇక విజయ్-జానీ మాస్టర్ల కాంబినేషన్ సూపర్హిట్ అనే చెప్పవచ్చు. ఇదివరకే అరబిక్ కుత్తు సాంగ్తో సంచలనం సృష్టించింది జానీమాస్టర్-విజయ్ కాంబినేషన్. ఇప్పుడు వీరి కాంబినేషన్లో రంజితమే పాట విడుదలైంది. తెలుగు వెర్షన్ పాటను త్వరలో విడుదల చేయనున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతమందిస్తున్న థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కుష్బూ, మీనా, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, యోగి బాబు, సంగీత వంటి నటీ, నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి విజయ్ వారసుడులోని రంజితమే సాంగ్ ఈ సినిమాకి హైలెట్గా నిలుస్తుందని చెప్పకనే చెప్పవచ్చు. సినిమా ఎలా ఉంటుందో సంక్రాంతి వరకు వేచి చూడాలి.