Rashmika Mandanna: పని మనుషుల కాళ్లు మొక్కుతా

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యూట్ హీరోయిన్ రష్మిక మందన ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆనతి కాలంలోనే ఈ సుందరి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. కన్నడ భామ రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లో సత్తా చాటుతోంది. కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తోంది.

కానీ ఈ మధ్య ఆమె నోరు తెరిస్తే చాలు ఏదో ఒక వివాదం మొదలవుతోంది. వరుస వివాదాలతో ట్రోలింగ్ సుడిగుండంలో చిక్కుకున్న రష్మిక మొదట్లో దీనిపై తెగ ఆందోళన చెందేది. కానీ రాను రాను వాటిని పట్టించుకోకుండా ఉండేందుకు ట్రై చేస్తూ వస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది రష్మిక.

“చిన్న చిన్న విషయాలు కూడా నాకెంతో ముఖ్యమైనవి. నేను లేవగానే నా కుక్క పిల్లలతో ఆడుకుంటాను. అది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మాటలు ఎంతో శక్తివంతమైనవి. ఆ మాటలతో మనిషిని నిలబెట్టవచ్చు. అదే మనిషి మనసు ముక్కలు చేయవచ్చు. నేను నా డైరీలో ప్రతి చిన్న విషయాలు కూడా రాసుకుంటాను. అందులో ఒకటి ఏంటో తెలుసా? నేను ఇంటికి రాగానే అందరి పాదాలకు నమస్కరించాలి. నా కుటుంబ సభ్యులవి మాత్రమే కాదు, మా ఇంట్లో ఉండే పని వాళ్ళ కాళ్లకు సైతం నేను నమస్కరిస్తాను. వాళ్లను వేరుగా చూడను. నాకు అందరిని గౌరవించడం మాత్రమే తెలుసు” అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు