Goodbye : ఎమోష‌న‌ల్ రైడ్‌గా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్, కుర్ర కారు హృదయాలను దోచుకుంది. అంతేకాదు తన నటనతో పాటు అందచందాలతో తెలుగు ప్రేక్షకులను గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తుంది. ఇక ఈ భామ తెలుగులో నటించిన లేటెస్ట్ మూవీ సీతారామం. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇది ఇలా ఉంటే రష్మిక మందన్నా ప్రస్తుతం టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అందులో భాగంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గుడ్ బై అనే చిత్రంలో నటిస్తుంది. కాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి మరో అప్ డేట్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను అధ్యంతం ఆకట్టుకుంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలనుకునే క్యారెక్టర్ లో రష్మిక నటించింది. అమితాబ్ బచ్చన్ తండ్రి పాత్రలో నటించాడు. తల్లి పాత్రలో నీనా గుప్తా నటించింది. ఎమోషనల్ రోలర్ క్రోస్టర్ గా సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. వికాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభ కపూర్, ఏక్త కపూర్ నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు