Rashmika Mandanna : ప్లాన్ వర్కౌట్ కాలేదు

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పై ఈ మధ్య కాలంలో ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది కూడా తన సొంత రాష్ట్రమైన కర్నాటక నుంచే వస్తున్నాయి. దానికి కారణం.. కాంతార సినిమా. ఈ సినిమా కన్నడతో పాటు పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది. కానీ, ఈ సినిమాపై రష్మిక ఓ సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో కన్నడిగులు నేషనల్ క్రష్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేశారు.

నిజానికి రష్మికపై కన్నడ సినీ ప్రేమికులు కాంతార సినిమా ముందు నుంచే కోపంతో ఉన్నారు. “కన్నడ సినిమాలతో స్టార్ గా ఎదిగి, శాండిల్ వుడ్ లో మినహా అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది” అంటూ అప్పట్లో తీవ్ర విమర్శలను ఈ భామ ఎదుర్కొంది. దీనికి తోడు కాంతార సినిమా సమయంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని లేపాయి.

దీంతో నేషనల్ క్రష్ చాలా మంది కన్నడ అభిమానులను కోల్పోయింది. అంతే కాకుండా తీవ్రమైన వ్యతిరేకతను కూడా మూటగట్టుకుంది. అయితే తనపై వస్తున్న వ్యతిరేకతను తొలగించుకోవడానికి రష్మిక మందన్న రెడీ అవుతుంది. అందుకోసం కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తోంది. అందులో భాగంగా బుధవారం నేషనల్ క్రష్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ వేసింది.

- Advertisement -

ఆ ట్వీట్ లో తను, పునిత్ రాజ్ కుమార్ కలిసి నటించిన అంజనీ పుత్ర సినిమా గురించి ప్రస్తావించింది. ఈ సినిమా వచ్చి 5 ఏళ్లు అవుతుందని ఈ ట్వీట్ వేసింది. సినిమా సమయంలో పునిత్ రాజ్ కుమార్ తో ఉన్న సంభాషణలను గుర్తుచేసుకుంది.

ఇక్కడ పునిత్ రాజ్ కుమార్ అంటే.. కన్నడిగులకు ఎంతో గౌరవం ఉంటుంది. ఆయన పేరుతో ట్వీట్ చేస్తే రష్మికకు పాజిటివ్ కామెంట్స్ వస్తాయని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఎన్ని ప్లాన్స్ వేసిన కన్నడ అభిమానులకు దగ్గర కాలేవు అంటూ రష్మికకు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అలాగే రష్మిక ప్లాన్ వర్కౌట్ కాలేదు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు