Rashmika: యాడ్స్ చేసుకుంటున్న రష్మిక

కన్నడ నటి రష్మిక మందన్న సౌత్ సినిమా ప్రేక్షకులకు నేషనల్ క్రష్ గా పరిచయం. కిర్రాక్ పార్టీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. దీంతో టాలీవుడ్ లోనే వరుసగా సినిమా ఛాన్స్ లు వచ్చాయి. అలా కొద్ది రోజుల్లోనే రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ గా మారిపోయింది.

ఇటీవల పుష్ప, వారిసు/వారసుడు సినిమాలతో వరుసగా రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇలా సక్సెస్ ఫుల్ నడుస్తున్న రష్మిక కెరీర్ ప్రస్తుతం డీలా పడిపోయింది. కన్నడ ఇండస్ట్రీలో కాంతార సినిమాపై రష్మిక చేసిన వ్యాఖ్యలు చేసిన నాటి నుంచి ఈమెపై వ్యతిరేకత వస్తోంది. నెటిజన్ల నుంచి చాలా సార్లు ట్రోల్స్ ను ఎదర్కొంటుంది. దీంతో సినిమా అవకాశాలు కూడా రావడం లేదు. ప్రస్తుతం రష్మిక మందన్న కేవలం 2 సినిమాల్లో మాత్రమే నటిస్తోంది.

అందులో ఒకటి పుష్ప కు సీక్వెల్ గా వస్తున్న పుష్ప2 కాగా, మరొకటి బాలీవుడ్ లో లో యానిమల్. ఈ రెండు చిత్రాల తర్వాత మళ్లీ ఏ ఛాన్స్ కూడా రాలేదు. దీంతో రష్మిక యాడ్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ శీతలపానీయం కంపెనీ అయిన సెవన్ అప్ (7up) కు రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సినిమా అవకాశాలు లేక నేషనల్ క్రష్ యాడ్స్ చేసుకుంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు