Rashmika: సమంతకు అమ్మనవుతా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, గత కొన్ని నెలలుగా మయోసైటీస్ అనే కండరాల సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే అంతకు ముందు నుంచే సమంత ఆరోగ్య పరిస్థితి పై పలు రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే అదంతా ఏమీ లేదని అంటున్నారు సమంత ఫ్యామిలీ. సమంత బాగానే ఉన్నారని స్పష్టం చేశారు. దీంతో ఆమె ఆరోగ్యంపై వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ అని తేలింది.

అయితే తాజాగా సమంత అనారోగ్యం గురించి మాట్లాడుతూ హీరోయిన్ రష్మిక మందన ఎమోషనల్ అయింది. రష్మిక నటించిన వారిసు మూవీ తెలుగులో వారసుడు పేరుతో జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే మిషన్ మజ్ను కూడా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాకి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న రష్మిక మందన, సమంత గురించి అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ ఎమోషనల్ అయిపోయింది.

సమంత ప్రకటించే వరకు ఆ మయోసైటీస్ వ్యాధి బారిన ఆమె పడినట్లు తనకు తెలియలేదని రష్మిక ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. సమంత మయోసైటిస్ బారిన పడినట్లు తను ప్రకటించే వరకు నాకు కూడా తెలియదు. మేము కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నా, తను ఎప్పుడూ ఆ విషయం గురించి మాటమాత్రంగా కూడా చెప్పలేదు. సమంత చాలా అందమైన, దయగల మహిళ. ఒక అమ్మలా తనని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్న. జీవితంలో తన ఎన్నో సవార్లతో పోరాడి నిలబడింది. అందుకే సమంత అంటే అందరిలా నాకు కూడా స్ఫూర్తి అనే రష్మిక చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు