Shrithi Haasan : హాట్ టాపిక్ గా సంక్రాంతి సినిమాల రెమ్యూనరేషన్

ఈ సారి సంక్రాంతి హడావుడి అంతా మెగా, నందమూరి అభిమానులదే ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్, బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. వీరితో పాటు సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కి కూడా ఈ సంక్రాంతి బాగానే కలిసొచ్చింది అని చెప్పవొచ్చు. “వకీల్ సాబ్” సినిమా తర్వాత తెలుగులో శృతి సినిమాలు విడుదుల కాలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత వచ్చిన ఈ రెండు సినిమాలు మంచి విజయాలని అందుకున్నాయి.

వీర సింహ రెడ్డి కొంత వరకు నిరాశ పరిచినప్పటకి కలెక్షన్ల పరంగా బాగానే ఉంది. అలాగే వాల్తేరు వీరయ్య అటు టాక్ పరంగా, ఇటు కలెక్షన్ల పరంగా ముందుంది. అంతే కాదు.. సంక్రాతి విన్నర్ గా నిలివడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ రెమ్యూనరేషన్ విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మెగా స్టార్ చిరంజీవి తో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకి గాను 2.5 కోట్లు, అలాగే బాలయ్య వీర సింహ రెడ్డి కి కూడా 2.5 కోట్ల భారీ రెమ్యూనిరేషన్ తీసుకుందని టాక్.

అంటే సంక్రాంతికి ఈ భామ దాదాపు 5 కోట్లను సంపాదించింది అన్నట్టు. అయితే ఈ రెండు సినిమాల ద్వారా శృతి హాసన్ కి భారీగానే డబ్బు వచ్చినా, కెరీర్ పరంగా ఈ రెండు సినిమాలు పెద్దగా ఉపయోగపడవు అని చెప్పొచ్చు. ఎందుకంటే, వీర సింహ రెడ్డి తో పాటు వాల్తేరు వీరయ్య సినిమాలో శృతి హస్సన్ క్యారెక్టర్ కు పెద్దగా ప్రాధాన్యత లేదు. హీరో పక్కన ఒక హీరోయిన్ ఉండాలని, సాంగ్స్ పరంగా సినిమాకు గ్లామర్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో మాత్రమే శృతిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు అనిపిస్తుంది. అంతే గానీ, కథ ప్రాధాన్యత పాత్ర అయితే కాదు.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు