Sai Dharam Tej: నాకు ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లి అయిపోయింది

మురళీ కిషోర్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కిరణ్ కి జోడీగా కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించింది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. తిరుపతి నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తోంది. మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించారు.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హీరో సాయి ధరమ్ తేజ్ హాజరై మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.అనంతరం సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతుండగా ఒక అభిమాని జనం మధ్యలో నుండి ” అన్నా పెళ్లెప్పుడు” అని అడిగారు. దీనికి సాయి తేజ్ సమాధానమిస్తూ.. ” మీరు ఎప్పుడైతే అమ్మాయిలను గౌరవిస్తారో అప్పుడు. అది మీ వల్ల అవుతుందా? ” అని ప్రశ్నించారు.

దీనికి ఊ అంటూ అభిమానులు సమాధానం ఇచ్చారు. ముందు మీరు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలని, తనకి ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లి అయిపోయింది అంటూ సరదాగా కామెంట్స్ చేశారు సాయి ధరమ్ తేజ్. ఇక ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు డైరెక్టర్ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది అన్నారు. ట్రైలర్ ఎంతో బాగుందని, సినిమా సక్సెస్ కావాలని అన్నారు. ఇక ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు