Sai Dharam Tej : కెరీర్ లో తొలిసారి..

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఒకడు. “మెగాస్టార్” చిరంజీవికి మేనల్లుడుగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు . వై.వి.ఎస్.చౌదరి “రేయ్” చిత్రంతో చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టి, ‘పిల్ల నువ్వు లేని జీవితం’ చిత్రంతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్, తన నటనతో సుప్రీం హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికే పలు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను పొందాడు.

అయితే శనివారం సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా, తన కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం 15వ ప్రాజెక్టు నుంచి అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈరోజు వచ్చింది. ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికర పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ను చూస్తూంటే.. సాయి ధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఆయన గతంలో ఇలాంటి పాత్ర చేయలదనట్టు అర్ధమవుతుంది.

అంతే కాకుండా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సినిమా టైటిల్ సహా టీజర్, ఫస్ట్ లుక్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

మరి ఈ టీజర్ ని నవంబర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. కాగా కిందటి వినాయక చవితి పండుగ రోజున సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు