Sai Dharam Tej : రూట్ మార్చేశాడు !

టాలీవుడ్ కు మెగా కంపౌండ్ నుండి చాలా మంది హీరోలు వచ్చారు. అందులో సాయి ధరమ్ తేజ్ ఒకరు. “పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్, వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో పాటు, తేజ్ నటనతో అవకాశాలు కూడా కాస్త ఎక్కువగానే వచ్చాయి. సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకు 14 సినిమాలు చేశాడు. అందులో ఇటీవల వచ్చిన “రిపబ్లిక్” మినహా అన్ని సినిమాలు కామెడీ, రొమాన్స్, యాక్షన్ జోనర్ లోనే ఉన్నాయి. ఒక “రిపబ్లిక్” సినిమానే కాస్త భిన్నంగా పొలిటికల్ డ్రామా స్టోరీ.

ఈ సినిమా విడుదల సమయంలో తేజ్ కు రోడ్డు ప్రమాదం జరగడంతో, ప్రమోషన్స్ పనులను స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసుకున్నారు. అయినా, ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. రోడ్డు ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు తాను చేయని సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ లో సినిమా చేస్తున్నట్టు సమాచారం. అందుకోసం ఏకంగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రంగంలోకి దిగుతున్నాడట. స్క్రీప్ట్ పనులు మొత్తం సుక్కుయే దగ్గరుండి చూస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. కాగా, ఈ సినిమాకు సుకుమార్ రైటింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు.

- Advertisement -

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు “రుద్రవనం” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని సమాచారం. రుద్రవనం అనే గ్రామంలో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతాయట. ఆ సమస్యను చేధించడానికి హీరో అక్కడి వెళ్లి, విచారణ చేస్తాడని, ఇదే స్టోరీ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా, దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ఈ స్టోరీతో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. కానీ, ఈ లైన్ లో సాయి ధరమ్ తేజ్ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రూట్ మార్చి సినిమాలు చేయడం ఈ మెగా మేనల్లుడికి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు