Yashoda : కొత్త తలనొప్పులు..

టాలీవుడ్ లో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే పేరు సమంత. ఎదో ఒక అంశంతో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. మొన్నటి వరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండంటంలో వల్ల.. ఇటీవల సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల అందరి నోట్లో సమంత పేరు నానింది. తాజాగా ఈ స్టార్ హీరోయిన్ మయోసైటిస్ అనే వ్యాధి బారిన విషయం తెలిసిందే. దీని తర్వాత కూడా సామ్ రోజుల తరబడి ట్రెండింగ్ లో ఉంటుంది.

ఇంతటి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ సినిమా చేస్తే.. అది కూడా లేడీ ఓరియెంటెడ్ అయితే.. అంచనాలు పీక్స్ లో ఉంటాయి. నిజానికి సామ్ ముఖ్య పాత్రలో నటించిన యశోదకు మొదటి నుంచి అలాంటి హైప్ నే క్రియేట్ అయింది. సమంత వ్యాధి బారిన పడిన తర్వాత కూడా యశోదపై ఉన్న బజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒకింత పెరిగిందనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా.. దర్శక నిర్మాతలకు ఇప్పడే అసలైన సమస్యలు వస్తున్నాయి.

యశోదకు ప్రస్తుతం ఉన్న బజ్ కు తోడు.. ప్రమోషన్లు చేస్తే మరింత హైప్ క్రియేట్ అవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. సామ్ పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రమోషన్ లలో పాల్గొనే స్థితిలో లేదు. ఇంటర్వ్యూలకు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేనని దర్శక నిర్మాతలతో చెప్పేసిందట. సామ్ లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం చాలా కష్టం. దీంతో ఈవెంట్ నిర్వహించకుండానే డైరెక్ట్ గా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ప్రమోషన్స్ లేకుండా సినిమా రిలీజ్ చేయడం వల్ల యశోద ఫలితంపై ప్రభావం కూడా చూపే అవకాశాలు లేకపోలేదు.

- Advertisement -

ఎంత వరకు అయితే అంత అని వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తో ఇంటర్వ్యూలు చేయిస్తున్నారు.ఇది సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో సహాయపడుతుందా అంటే, దానికి సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. ఇన్ని ఇబ్బందుల మధ్య యశోద రిలీజ్ అవుతుంది. మరి దీని ఫలితం ఎలా ఉంటుంది ? నిర్మాతలు ఎంత వరకు లాభపొందుతారు అని తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు