Samantha: అది నావల్ల కాలేదు

సినిమా ప్రపంచంతో పరిచయం ఉన్నవారికి సమంత గురించి పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఈమె సినిమాలలోకి వచ్చిన దగ్గరనుంచి ఏవో ఒక కారణాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం విడుదల సమయంలో ఈ సమస్య గురించి స్వయంగా వెల్లడించింది. సెలైన్ పెట్టుకుని మరీ ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పిన సమంత ఆ తర్వాత కొన్ని నెలలపాటు చికిత్స కొనసాగించింది. ఈ క్రమంలో సమంత చాలాకాలం పాటు బయట కనిపించకపోవడంతో ఆమె కెరీర్ పై రకరకాల పుకార్లు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ వ్యాధి భారీనుండి సమంత పూర్తిగా కోరుకున్నారు.

మొన్నటికి మొన్న ఒక ఎయిర్ పోర్టులో దర్శనమిస్తూ చాలామందికి కనిపించి, కొంతమందికి సెల్ఫీలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం సమంత శాకుంతలం చిత్రం డబ్బింగ్ పనుల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శాకుంతలం పాత్రలో నటించడానికి తాను పడిన కష్టాలను తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సమంత. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ” శకుంతలం సినిమాలో కష్టమైన పని ఏంటి అంటే.. ఒకే రకం అయిన భావం కనిపించేటట్టు ఉండడం. నడుస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా ఒకే స్టైల్ ఇవ్వడం నావల్ల కాలేదు. దానికోసం ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. అలాకాకుండా పెంపుడు కుక్కను కూడా వెంట తీసుకెళ్లి ఉండాల్సింది” అంటూ దీనంగా చూస్తున్న పెంపుడు కుక్క వీడియోతో పాటు శాకుంతలం భంగిమలు షేర్ చేసింది సమంత. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

- Advertisement -

 

For More Updates: Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు