Samantha: జీవితం అంతకుముందులా లేదు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సమంత మొన్నటి యశోద సినిమా వరకు 12 ఏళ్లుగా నీరాటంకంగా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. అయితే ఇటీవల మయోసిటీస్ అనే అరుదైన వ్యాధి నుండి కోలుకునేందుకు సమంత మెరుగైన వైద్య చికిత్స తీసుకుంటున్నానని వెల్లడించిన విషయం తెలిసిందే.

కొద్ది రోజుల క్రితం ఈ వ్యాధి బారిన పడిన సమంత ప్రస్తుతం చికిత్స పొందుతుంది. దీంతో ఆమె ఇంటికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో చాలాకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సమంత అభిమానులతో టచ్ లోకి వచ్చింది. ట్విట్టర్ లో లైవ్ చాట్ నిర్వహించి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా జవాబులు ఇచ్చింది.

ఇందులో భాగంగా ఓ అభిమాని.. ” మేడం మీ జీవితం ఎలా సాగుతోంది” అని అడిగారు.. దీనికి సమంత విభిన్నంగా ఉంది అంటూ సమాధానం ఇచ్చింది. ఇక మరో అభిమాని.. ” మేడం మీరు త్వరగా కోలుకోవాలని మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రతి రోజు ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మళ్లీ మీరు బాక్సాఫీస్ సక్సెస్ లు అందుకోవాలి. అలాగే విమర్శలను తిప్పికొట్టాలి” అని కోరగా.. ” మీ ఆశీస్సులు, ప్రార్థనలు నాకెంతో అవసరం. ఇంతకీ ఏం విమర్శలు” అంటూ ఫన్నీగా జవాబిచ్చింది.

- Advertisement -

అనంతరం తను కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది సమంత. ఇక సమంత కొత్త చిత్రంశాకుంతలం సినిమా గురించి అభిమాని ప్రస్తావించాడు. 3డి లో రిలీజ్ చేసేంత ప్రత్యేకత శాకుంతలం సినిమాలో ఉందా? అని ప్రశ్నించాడు. దీనికి ” మీరే చూస్తారుగా” అంటూ సమంత వెల్లడించింది. ఇక చాలా రోజుల తర్వాత సమంత సోషల్ మీడియాలోకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు