Samantha : రిలీజ్ కు బ్రేక్!

యూటర్న్, ఓ బేబీ లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తన టాలెంట్ ఏంటో చూపించిన సమంత, మొదటిసారి ఓ పౌరాణిక పాత్రలో కనిపించబోతోంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “శాకుంతలం”. ఈ చిత్రంలో టైటిల్ రోల్ ను పోషిస్తున్నారు సమంత. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో పీరియాడికల్ స్టోరీ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనన్య నాగళ్ళ, అల్లు అర్హ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇది ఇలా ఉండగా “శాకుంతలం” మూవీ విడుదల వాయిదా పడింది. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా “శాకుంతలం” విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

“మేము శాకుంతలం సినిమాతో అద్భుతమైన అనుభవాన్ని ప్రేక్షకులకు అందివ్వాలని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈ సినిమా 3D వర్షన్ లో తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. అందుకోసం మరింత సమయం పట్టనుంది. అందుకే ముందుగా ప్రకటించిన తేదీకి సినిమాను విడుదల చేయలేకపోతున్నాం. ప్రపంచం నలుమూలలా నుంచి మాపై కురిపించిన మద్దతు, ప్రేమకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సినిమా విడుదల వాయిదా వేస్తున్నందుకు మీ మద్దతు కోసం ఆశిస్తున్నాం. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం” అంటూ మూవీ మేకర్స్ ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు