Samantha: నా పిచ్చికి అదే మందు

సమంత, కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే అంతకు ముందు నుంచే సమంత ఆరోగ్య పరిస్థితి పై పలు రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల సమంత ఆరోగ్యం క్షీణించింది అంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అదంతా ఏమీ లేదని అంటున్నారు సమంత ఫ్యామిలీ. సమంత బాగానే ఉన్నారని స్పష్టం చేశారు. దీంతో ఆమె ఆరోగ్యంపై వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ అని తేలింది.

ఇది ఇలా ఉండగా, సమంత కీ రోల్ లో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీ జనవరి 17న విడుదల కానుంది. ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నారు. సమంత తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటుంది. శాకుంతలం చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న ఫోటోను సమంత ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దానికి ఒక ఆసక్తికర కోట్ జోడించారు.

“నా పిచ్చికి, బాధకు, ప్రపంచంలో కోల్పోయిన వాటికి కలనే మందు. దాని సహాయంతో నేను నా గమ్యానికి చేరుకుంటాను” అని రచయిత నిక్కీ రో రాసిన కోట్ పంచుకున్నారు. తన జీవితానికి ఈ కోట్ సరిపోతుందని ఆమె భావన. ఇక తనకు ఇష్టమైన సినిమా కలలో, పనిలో నిమగ్నమే కష్టాలు, నష్టాలు, బాధలు మర్చిపోతానని సమంత చెప్పకనే చెప్పింది. తన అనారోగ్యానికి కూడా సినిమానే మందని సమంత పరోక్షంగా వెల్లడించారు. సమంత ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా తాజాగా సమంత అనారోగ్యం గురించి మాట్లాడుతూ హీరోయిన్ రష్మిక మందన ఎమోషనల్ అయింది. సమంత మయోసైటిస్ బారిన పడినట్లు తను ప్రకటించే వరకు నాకు తెలియదు. మేము కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్న, తను ఎప్పుడూ ఆ విషయం గురించి మాటమాత్రంగా కూడా చెప్పలేదు. సమంత చాలా అందమైన, దయగల మహిళ. ఒక అమ్మలా తనని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నాను అని తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు