Sameer: పబ్లిక్‌గా బాలయ్య నన్ను తోసేశాడు…

నందమూరి నటసింహం బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అగ్ర నటుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అన్ స్టాపబుల్ అనే షో చేస్తున్న నాటి నుంచి ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఈ షోలో బాలయ్య కామెడీ, కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ షోతో బాలయ్యపై ఉన్న కోపిష్టి, అభిమానులను కొడుతాడు అంటూ వచ్చే వార్తలకు చెక్ పడింది.

అయినా, బాలయ్య అంటే భయమే. ఎక్కడ కోపానికి వచ్చి ఏం అటారో అని అభిమానులు, తోటి నటీనటులు కూడా భయపడుతారు. కానీ, కొంత మంది బాలయ్యది చిన్న పిల్లల మనసత్వం అని చాలా మంచి వ్యక్తి అని కూడా అంటారు. ఇదిలా ఉండగా, ప్రముఖ నటుడు సమీర్.. బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక మూవీ ప్రమోషన్ సమయంలో తనను బాలయ్య పబ్లిక్ గా తోసేశాడు అంటూ కామెంట్ చేశాడు. అయితే అది ఎక్కడో మాత్రం చెప్పలేడు.

యాంకర్ సుమ ఇటీవల సుమ అడ్డా అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు నటులు సమీర్, గిరిధర్, నటి హేమ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ షో సమయంలో తనకు బాలయ్యతో జరిగిన ఒక సందర్భాన్ని సమీర్ గుర్తుచేసుకున్నాడు. “ఒక సినిమా ప్రమోషన్ సమయంలో బాలయ్య తో వెళ్లాను. అక్కడ అభిమానులు చాలా మంది వచ్చారు. ఇంత మంది ఫ్యాన్స్ మధ్యలో నుంచి ఎలా వెళ్లాలి అని అన్నాను. ఇంతలోనే బాలయ్య నన్ను తోసేశారు” అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు