Sharwanand : పొలిటికల్ కాన్సెప్ట్ తో..

విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో శర్వానంద్. మహానుభావుడు, శతమానం భవతి, శ్రీకారం తో పాటు ఇటీవల వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్లుకు దగ్గర అయ్యాడు. శర్వానంద్ ప్రస్తుతం ఒకే ఒక జీవితం అనే చిత్రం చేశాడు. ఇది కూడా ఫ్యామిలీ డ్రామా సినిమానే కావడం విశేషం. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన తెలుగు, తమిళ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అమ్మ ప్రేమ, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ చిత్రం వస్తున్న క్రమంలో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్రంతో శర్వానంద్ మంచి హిట్ కొట్టడం ఖాయమని తెలుస్తుంది. దీని తర్వాత శర్వా మరో సినిమాను లైన్ లో పెట్టాడు. ఇప్పటి వరకు ఫ్యామిలీ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చిన శర్వా, ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వా హీరోగా కొత్త సినిమా రాబోతుంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రాశీ ఖన్నా, నటిస్తుండగా, ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. సోమవారం జరిగిన పూజా కార్యక్రమానికి దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, చందూ మెండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ హాజరయ్యారు. కాగా ముహూర్తపు సీన్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. అయితే ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు