Shivani Rajashekar : ఇప్పట్లో ఆ ఆలోచన లేదు

టాలీవుడ్ లో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. వీరిలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ ఒకరు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో వచ్చిన అద్భుతం సినిమాతో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. దీని తర్వాత డబ్యూ డబ్యూ డబ్యూ అనే సినిమాలో నటించింది. ఈ ఏడాదిలో తమిళ ఇండస్ట్రీలో కూడా అరంగేట్రం చేసింది. అక్కడ అన్బరివు, నెంజుకు నీది అనే సినిమా చేసిన తర్వాత మళ్లీ టాలీవుడ్ కు వచ్చింది.

తాజాగా శివానీ రాజశేఖర్ నుంచి వచ్చిన వెబ్ సిరీస్ ఆహా నా పెళ్లంట. ఈ వెబ్ సిరీస్ జీ 5లో ప్రసారం అవుతుంది. విడుదలకు ముందే విభిన్నమైన ప్రమోషన్స్ చేసిన వెబ్ సిరీస్ యూనిట్, ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్లలో శివానీ రాజశేఖర్ తనపై వస్తున్న పలు రూమర్స్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. “నేను పెళ్లి చేసుకోబోతున్నానని, ఎవరినో ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఎదిరించి వెళ్లిపోయానని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. దీనిలో ఏ మాత్రం కూడా నిజం లేదు” అని తెలిపింది.

అలాగే “పెళ్లి విషయంలో నాకు ఇప్పుడే కంగారేం లేదు. అమ్మ నాన్నలు కూడా నా పెళ్లి గురించి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ముందు నా కెరీయర్ నాకు ముఖ్యం. పూర్తిగా సెటిల్ అయ్యాకే పెళ్లి గురించి ఆలోచిస్తా. మా ఫ్యామిలీ గురించి కూడా అప్పుడప్పుడు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయినా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సెలబ్రెటీలు చనిపోయినట్టు రూమర్స్ వస్తున్నాయి. అలాంటి సమయంలో నాపై వచ్చే రూమర్స్ చాలా చిన్నవి” అంటూ శివానీ రాజశేఖర్ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు