Shruthi Hassan: వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా..

టాలీవుడ్ టాప్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, కొద్దీ కలంలోనే తనకంటూ ఓ గుర్తింపును ఏర్పరచుకుంది . గత ఏడాది ‘క్రాక్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శృతిహాసన్… వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలలో చాన్స్ కొట్టేసింది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ కాగా, మంచి టాక్ తెచ్చుకున్నాయి. దీంతో శృతిహాసన్ క్రేజ్ మరింత పెరగనుంది. సైలెంట్ గా ఉండే శృతిహాసన్ ఇలాంటి బంపర్ ఆఫర్లను కొట్టి… మంచి విజయాలను సాధించడం గమనార్హం.

ఇదంతా పక్కకు పెడితే.. తాజాగా శృతిహాసన్ షాకింగ్ నిజాన్ని బయట పెట్టింది.శృతిహాసన్ కొన్ని మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు స్వయంగా తానె బయటపెట్టింది. ”చిన్న చిన్న విషయాలకు కూడా సహనాన్ని కోల్పోయి విపరీతమైన కోపంతో రగిలిపోతాను… ఈ విషయంలో నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించినా కూడా సాధ్యం కావడం లేదు. మొదట ఈ విషయాన్ని బయట చెప్పకూడదని అనుకున్నాను. అది కూడా నా యొక్క మానసిక రుగ్మత గానే అనిపించింది. అందుకే నేను ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెడుతున్నాను అంటూ శృతిహాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అంతేకాదు ఈ వ్యాధికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్లు తెలిపింది.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

 

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు